Monday, April 11, 2016

కొన్ని పక్షులు గాలిలోగిరికీలు కొడుతూ
విహంగ విన్యాసాలుచేస్తూ విచలిత
ఆనందాన్ననుభవిస్తాయి.
గాలితోపాటు ఎగుడుదిగుడుగా జారిపడుతూ
అప్పటికప్పుడే నిలదొక్కుకుంటూ
అనూహ్యంగా నవ్వును  తెప్పిస్తాయి.

నీటిప్రవాహంలో కొన్ని జంతువులు
నిర్దాక్షిణ్యంగా కొట్టుకుపోతుంటాయి..

ఉదయాన్నే పచ్చిక బయలులో గడ్డిపోచలపై
హిమబిందువులు ముత్యాలలాగా మెరిసిపోతుంటాయి..

సాలెపురుగు తన ఆహారంకోసం కట్టుకున్న గూడంతా
కలియదిరిగి ఎప్పుడు దొరుకుతుందా అని వేచిచూస్తుంటుంది.

భగవంతుని సామ్రాజ్యంలోకూడా శ్రీనివాసుల
సిఫారసులకే అత్యధిక ప్రాధాన్యం లభిస్తుంది..

ప్రకృతి తన సుమసౌరభంపు గుబాళిపులను పీల్చి
పరవశమతో ప్రసిద్ధంగా నాట్యం చేస్తుంటుంది..

కానీ నేనొక్కడిని మాత్రం ఏకాంతంగా
వేలకొద్దీ బాధలను ఒంటరిగానే అనుభవిస్తూ
గతస్మృతులను కరాఖండీగా నెమరువేస్తూ
వర్తమానంలోకి తొంగిచూస్తూ జీవితం గడుపుతున్నాను..
[ TUFU ---  చైనీస్ కవితకు అనుసరణ ]


No comments:

Post a Comment