అధర్మో భక్షతి భక్షితః------
[1]
స్వామీజీ పర్యటిస్తున్నారంటే అక్కడ చుట్టు పక్కలపాతిక గ్రామాలకు ,వారి అనుంగు శిష్యులు పదిరోజులుముందుగానే వచ్చి స్వామీజీ వారి అద్భుత లీలను మహిమలను స్వయంగా వారు వైద్య పరిభాషలో అత్యద్భుతం గా పరిగణించదగిన మహిమలను ,ఇంకా యెన్నో మొండి రోగాలను వారు చిటికెలో మటు మాయం చేసిన కధనాలను,
గ్రామ గ్రామాన వినిపి స్తూ ఉంటారు .స్వామీజీవారిని పలురకాల సేవలతో పూజించి పునీతం కమ్మని హిత బోధ చేస్తుంటారు. స్వామీజీ వారు ఇలా వారి నగరానికి విచ్చేయడ0ఆయా గ్రామాలవారి,
మరియూ వారి పూర్వీకుల పూర్వ జన్మ సుకృతమనీ చెపుతూ వుంటారు .
స్వామీజీ చేయలేని సేవాకార్యక్రమాలు లేవని మానవ సేవే మాధవ సేవని నమ్మిన మహానుభావుడని అందరికీ అడిగినా అడగక పోయినా యేకరువు పెడుతుంటారు.
అది వారి ప్రచారపర్వంలో భాగం మాత్రమేనని మనం గమనించ గలగాలి.
స్వామీజీ సేవలోపునీతం కవాలని అగ్రభాగంలో ఉంటూ వారికి అనునిత్యం చేదోడు వా దోడు గాఉంటూ0డాలని వారి జీవితాశయం తపన గూడా. స్వామీజీ ఇటీవలి కాలంలో ఎక్కువ భాగం విదెశీ పర్యటనలో గడుపుతున్నారనీ దానికి కారణం ఆయన హైదరాబాదులో నిర్మిస్తున్న వికలాంగుల ఆసుపత్రి వ్రృద్ధాశ్రమం కొరకు నిధుల సేకరణె లక్ష్యమని తెలిసినా శిష్యులు మాత్రం అక్కడ శిష్య పరమాణూవుల ఒత్తిడి మేరకే వెళ్ళ వలసి వస్తుందనీ వివరిస్తుంటారు. ఆయనమీద ఎవరూ పల్లెత్తు మాట అనకుండా ప్రతిక్షణం జాగ్రత్త పడుతుంటారు . వారి పాదసేవకోసం ఇప్పుడే చందా వ్రాసుకోవడం మేలనీ, రాను రానూ ఆక్తి గల భక్తులు సంఖ్య పెరిగేకొద్దీ చందా సొమ్ము పెరిగే అవకాశం ఉంటుందనీ కొద్ది కొద్దిగా ఆందోళన పెడుతూ, తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.
అక్కడ విదేశాల్లో వీళ్ళు చెప్పినట్లు ఆక్కడి భక్తగణం తపన పడడ0
లేదనీ కొందరు ముఖ్య భక్తులు ఈయన పెట్టే మొహమాటాలూ చదాలకోసం వాళ్ళను పెట్టే పాట్లూ భరించలేక స్వామివారు విదేశీ పర్యటనన ఖరారు కాగానే ప్రీమియం రేట్లలోనయినాసరే విమానం టిక్కెట్లు కొనీ మరీ ఇండియాకి పరుగెట్టుకు వస్తున్నట్లు సమా చారం.
ఇవన్నీ ఎలాగున్నా అమాయకులను డబ్బుకో సం మోసం చేయడం మాత్రం నిరాటంకంగా జరుగుతూనే వునంది. ఈ సందడిలోనే వైజాగ్ నించి సుభాషిణి అనే అరవయ్యే ళ్ళ ఆడకూతురు చెప్పిన కధవింటే ఈస్వాములోర్లు ఎందుకోసం ఇలా
మాయా చెస్తున్నారో అర్ధం కాదు. ఆవిడ భర్తకు ఆరోగ్యం బాగాలేక స్వామీజిని కలిసి కష్టాలూ చెప్పుకుందామని ఆయన్ను కూడా తీసుకుని ఒచ్చింది ఆమెతో స్వామీజీ 30 వేలు తీసుకుని 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చారు. వెళ్ళగానే ఆయన ఆరోగ్యాని వాళ్ళా ఇంటికున్న వాస్తు దోషం కారణమనీ అది వాళ్ళ పేరిటౌన్నంత కాలం ఆయన ఆరోగ్య స్థితి క్షీణిస్తుందేగాని మెరుగుపడదనీ చెప్పడంటొ ఆమే డీలా పడిపోయింది నిస్త్రాణగా. అదేమితి స్వామీజీ అది మా అత్తగారి
[2]
దగ్గరనుండి వస్తున్న ఆస్తి. మా అత్తా మమా పూర్ణాయుష్కులుగా జీవించారు . ఆయన వారసుదే గదా ఈయనకెందుకు వాస్తు అడ్డొస్తుంది ? అని అడిగింది.
స్వామీజీ ఇంతెత్తుగా కోపం వచ్చింది. స్వామీజీలు కూడా కోప తాపాలకతీతులు కాదా అని అనుమానమొచ్చింది ఆమెకు.
స్వామీజీ వెంటనే శిష్యులను కేకేసి ఎందుకు ఇలాంటి స్వామివారి మాటలమీద నమ్మకం లేని వారిని పంపిస్తారు . ఆమెకు నామీద నా మాటలమీద నమ్మకం కలిగించి పంపం డి లేదా చేజేతులా ఈవిడ ఆయన్ను దూరం చేసుకుంటుందో సిద్ధం కమ్మనండి .అని విసురుగా పూజా మందిరంలోకి రుస రుస లాడుతూ వెళ్లి పోయారు
ఆమె స్వామివారి తీరుకు నిరుత్తర అయింది .ఎదోలా ఆయనను కాపాదుకో వాలనే నినయానికి ఒచ్చింది. ఆస్తులు ఎప్పుడయినా సంపాదించుకోవచ్చు .ప్రాణం కాపాడూ కుంటానని నిర్ణయించుకుంది. ఆవిడ ఆవేదనా తప్త హృదయంతో గుద్లల్లో నీరుకుక్కుకుంటూ సామీజీ దగరకు బిక్కు బిక్కుమంటూ ఒచ్చింది.
స్వామీ జీ కసురుతున్నట్లే మాట్లడుతూ యెమ్మా మల్లెందుకు ఒచ్చి నన్ను వ్సిగిస్తావు? ఈకు మీ ఆయన ప్రాణం కన్నా అశాశ్వతమైన ఆస్తిపాస్తులమీదే మక్కువ ఇంకా నేనేం మాట్లాడగలను చెప్పు . నీవెలగనుకుంటే అలాగే చేయ్ . నన్ను ఇంకేమాత్రం విసిగించకు అంటూ
కసురుకున్నారు. ఇక ఆసుమంగంగళి చేసేదేమీలేక .ఆయన పాదాలమీఎద పడి గజేంద్రమోఖంలో మొసలిబారిన పడ్డ యేనుగులా నీవే తప్ప అన్యధా శరణం నాస్తి అన్న పద్ధతిలో పాదాక్రాంతమయింది. అప్పుడు స్వామీజీ శిష్యులలో అతిముఖ్యుడు ఆమె దగ్గరకొచ్చి అమ్మా!! మీకున్న ఆ వాస్తు దోషంగల ఆస్తి. మీపేరున ఉన్నంతవరకూ మీకీ గ్రహదోషపు కష్టాలు తప్పవు