అతను అందరూ మెచ్చి నచ్చిన కవి
తన జీవిత భాగస్వామిపై ప్రణయ గీతాలను రచించి
ప్రేమికుల హృదయాలలో ప్రముఖమైన స్థానాన్నలంకరించాడు..
తన కవిత్త్వ సంపుటికి విశేష ప్రజాదరణను సంపాదించాడు..
ఒకరోజు ఆమే నిశ్చలంగా కుర్చీలోకూలబడివుంటే
జీవన మర్మం గురించి వ్రాసిన కవితను ఎప్పటిలాగే
ఆమెకు చదివి వినిపించి ప్రత్యుత్తరం రానందుకు
ఖేదపడుతూ ఆమెను కుదిపి కదిపాడు..
అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలోకలిసాయని తెలిసి
విషణ్ణవదనంతో ఏకోన్ముఖంగా విలపించి పోయాడు..
ప్రణయం ప్రళయమై గర్జించిందని ఘూర్ణిల్లాడు,..
అలా బాధతో వెలార్చిన విరహ గీతాలను
భద్రంగా ఆమె శవపేటికలో భద్రపరిచి
తన దు:ఖానికి కొంత ఉపశమనం పొందాడు..
ఏడేళ్ళు కాలెండర్ కాగితాలు ఊడిపోయి నేలకు రాలాక అతనికి
ఆకవితలకు నకలులు తీయడం మరిచిపోయానని గుర్తుకొచ్చింది..
కొందరు కూలీలను పిలిచి ఖననం చేసిన పేటికను దూరంగా వుండి
బయటకు తీయించాడు..ఏవో వజ్రాలో , వైఢూర్యాలో అక్కడ వుంచి
మరచిపోయివుంటాడని ఆ శ్రామికులు భావించి ఇతోధికంగాశ్రమి0చి
పలుగూ పారలతో దాన్ని తవ్వి పేటికను బయటకు లాగారు..
అందులోని ముచ్చటగా పేర్చిన మూడు కాగితాలను తెమ్మన్న అతనిని చూసి
ఒక పిచ్చి మాలోకం ఈ లోకానికి దిగివచ్చాడని నవ్వుకుంటూ సంబరపడిపోయారు..
ఇంటికి వచ్చాక తమతమ శ్రీమతులను చూడగానే తమ భార్యలకు ముందు ముందు
ఏ బహుమతులనివ్వాలో తలచుకుంటూ మతులను పోగొట్టుకుని
మూర్తీభవించిన శిలల్లా శేష జీవితం గడపుతూ కవిగారు ప్రకటించిన
ప్రేమకు శాశ్వతంగా
కృతజ్ఞతాపూర్వకంగా బందీలుగా మిగిలిపోయారు.
[ఒక ఆంగ్ల కవిత చదివిన నేపధ్యంలో]
======================================
తన జీవిత భాగస్వామిపై ప్రణయ గీతాలను రచించి
ప్రేమికుల హృదయాలలో ప్రముఖమైన స్థానాన్నలంకరించాడు..
తన కవిత్త్వ సంపుటికి విశేష ప్రజాదరణను సంపాదించాడు..
ఒకరోజు ఆమే నిశ్చలంగా కుర్చీలోకూలబడివుంటే
జీవన మర్మం గురించి వ్రాసిన కవితను ఎప్పటిలాగే
ఆమెకు చదివి వినిపించి ప్రత్యుత్తరం రానందుకు
ఖేదపడుతూ ఆమెను కుదిపి కదిపాడు..
అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలోకలిసాయని తెలిసి
విషణ్ణవదనంతో ఏకోన్ముఖంగా విలపించి పోయాడు..
ప్రణయం ప్రళయమై గర్జించిందని ఘూర్ణిల్లాడు,..
అలా బాధతో వెలార్చిన విరహ గీతాలను
భద్రంగా ఆమె శవపేటికలో భద్రపరిచి
తన దు:ఖానికి కొంత ఉపశమనం పొందాడు..
ఏడేళ్ళు కాలెండర్ కాగితాలు ఊడిపోయి నేలకు రాలాక అతనికి
ఆకవితలకు నకలులు తీయడం మరిచిపోయానని గుర్తుకొచ్చింది..
కొందరు కూలీలను పిలిచి ఖననం చేసిన పేటికను దూరంగా వుండి
బయటకు తీయించాడు..ఏవో వజ్రాలో , వైఢూర్యాలో అక్కడ వుంచి
మరచిపోయివుంటాడని ఆ శ్రామికులు భావించి ఇతోధికంగాశ్రమి0చి
పలుగూ పారలతో దాన్ని తవ్వి పేటికను బయటకు లాగారు..
అందులోని ముచ్చటగా పేర్చిన మూడు కాగితాలను తెమ్మన్న అతనిని చూసి
ఒక పిచ్చి మాలోకం ఈ లోకానికి దిగివచ్చాడని నవ్వుకుంటూ సంబరపడిపోయారు..
ఇంటికి వచ్చాక తమతమ శ్రీమతులను చూడగానే తమ భార్యలకు ముందు ముందు
ఏ బహుమతులనివ్వాలో తలచుకుంటూ మతులను పోగొట్టుకుని
మూర్తీభవించిన శిలల్లా శేష జీవితం గడపుతూ కవిగారు ప్రకటించిన
ప్రేమకు శాశ్వతంగా
కృతజ్ఞతాపూర్వకంగా బందీలుగా మిగిలిపోయారు.
[ఒక ఆంగ్ల కవిత చదివిన నేపధ్యంలో]
======================================
No comments:
Post a Comment