Monday, May 23, 2016

అవశేషం
----------------రావెల

పాపం ఆకుర్రాడు
ముక్కు పచ్చలైనాఅరినట్లు కనబడలేదు..
ఏవరి పుణ్యఫలమో కూడా తెలియదు..
మీసాల పొందికగూడా ఇంకా పూర్తిగా
 యేర్పడిన దాఖలా లేదు..

రహదారి మార్గంలో వేగం గా వస్తున్న కారు
ఎలా ఢీకొట్టిందో తెలియడంలేదు..
ఆప్రక్కనే తీయబడిన లోతయిన గుంటనీటిలో పడి
జలసమాధియై పోయినట్లున్నాడు..

ఏ తల్లి శుక్తిముక్తాఫలమో పాపం
ఈ విధంగా అకాల మృత్యువుకు బలై పోయాడు..
ఆగి చూసిన అందరికీ అశ్రువులతో నయనాలు
జలాశయాలవుతున్నాయి..


'మితిమేరిన వేగంతో ప్రయాణం చేయకండి
బాటసారులూమీరుకూడా నా కొడుకుతో పాటు
మృత్యువుతో కౌగిలిలోకి ఒరిగిపోవడానికి
 సిద్ధపడాల్సి వుంటుంది..' జాగ్రత్త సుమా!!

అని కొన్నాళ్ళ తర్వాత తల్లిదండ్రులు అక్కడొక హెచ్చరిక
బోర్డును పెట్టి బాటసారులను హెచ్చరించడం కొత్తగా అనిపించినా
అవసరమేననితోచింది.. ఆ ఫలకం పైని అక్షరలే ఆకుటుంబానికి
స్మృతిపధంలో శాశ్వతమై జీవన గమనంలో మిగిలిపోయాయి..
[ఓ ఆంగ్ల కవితను చదివిన నేపధ్యంలో---]

No comments:

Post a Comment