Saturday, May 14, 2016

అన్నింటా శిశిరతోరణాలే
స్వాగత వచనాలు పలికితే
వసంతం తన ఊసును మరిచిపోయి
గ్రీష్మానికే అతుక్కుని  శాశ్వత
ప్రాతిపదికన అంకితమై పోతే
వాన తన రాకడను ఏదో ఒక సాకుతో
వాయిదాల మీద వాయిదాలేస్తూ పోతుంటే
శరదృతు హేమంతాలు చలినెగళ్ళమన్న
విషయాన్నే విస్మరిస్తూ పోతుంటే

ఇక రుతునర్తనానికి విలువెక్కడ?
 కనీసం వాటికి భువిపై
నిలువనీడుండే  చోటుంటుందా?

నిత్యం ఒకటే దృశ్యాన్ని వీక్షించే
సుమనస్కులకు కొత్తదనం రుచి చూడలేని
దురదృష్టం దాపురించినచో దిక్కేమిటి?
వారిని కంటికి రెప్పలా కాపాడగల ధీశాలులెవ్వరు?
======================================================

No comments:

Post a Comment